214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 17 2018 9:43 AM

Ys Jagan Mohan Reddy 214th Day Prajasankalpayatra Begins  - Sakshi

సాక్షి, అనపర్తి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 214వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం వైఎస్‌ జగన్ పెద్దపూడి మండలం కరకుదురు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అచ్యుతాపురం, రామేశ్వరం మీదుగా కొవ్వాడ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్న జననేతకు అభిమానులు, ‍ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. తమ కష్టలను వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా జననేత వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement